భీంగల్ లో సివిల్ కోర్టు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

భీంగల్ లో సివిల్ కోర్టు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

బాల్కొండ, వెలుగు: నిజామాబాద్ జిల్లా భీంగల్ లో జూనియర్ సివిల్ కోర్టు ఏర్పాటుకు రాష్ట్ర సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు న్యాయ శాఖ కార్యదర్శి తిరుపతి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థిక శాఖ పర్మిషన్ తో  హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ధివిధానాలు రూపకల్పన చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో సివిల్, క్రిమినల్ కేసులు పెరగడంతో భారం పడకుండా భీంగల్​లో కోర్టు ఏర్పాటు చేయాలని ఆర్మూర్ బార్ అసోసియేషన్ హైకోర్టుకు వినతులు సమర్పించింది.

ఈ నేపథ్యంలో భీంగల్ న్యాయ పరిధిని పేర్కొంటూనే ఆర్మూర్ లో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఏర్పాటు చేశారు. భీంగల్ లో కోర్టు ఏర్పాటైతే సిరికొండ, కమ్మర్ పల్లి, మోర్తాడ్, వేల్పూర్, ఏర్గట్ల మండల పోలీస్ స్టేషన్లలో నమోదైన క్రిమినల్, సివిల్ కేసులు పరిష్కారం కానున్నాయి. కోర్టు ఏర్పాటుకు గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా హైకోర్టు పరిశీలన తర్వాతే మంజూరు కానుందని బార్ అసోసియేషన్ మెంబర్లు పేర్కొన్నారు.